న్యూఢిల్లీ: ఒకప్పుడు దొంగతనాలు జరిగితే నిందితులను పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో చాలావరకు కేసుల చేధన సులభతరం అవుతున్నది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ లొకేషన్లతో దొంగలను ఈజీగా పట్టేస్తున్నారు. అయినా దొంగలు మాత్రం దోపిడీలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.
గత అర్ధరాత్రి హర్యానాలోని రేవారి పట్టణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. కేవలం 8 నిమిషాల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రేవారీలోని నాలుగు పెట్రోల్ పంపులను నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా లూటీ చేసింది. నాలుగు పెట్రోల్ పంపుల్లో కలిపి రూ.1.05 లక్షలను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
#WATCH हरियाणा: रेवाड़ी में बीती रात 4 अज्ञात लोगों ने बंदूक की नोक पर 4 पेट्रोल पंपों में लूटपाट की। वीडियो CCTV का है। pic.twitter.com/ZwOy8sqowp
— ANI_HindiNews (@AHindinews) December 12, 2022