డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కీలక అంశాలను బీజేపీ మరుగుపరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆయా అంశాలపై పోరాడుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత హరీష్ రావత్ అన్నారు.
వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తరాఖండ్ ఎన్నికలకు పదునైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము చేపట్టిన పరివర్తన యాత్ర మార్పు దిశగా పయనిస్తోందని, బీజేపీ అసమర్ధ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోందని అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అసమర్ధ అవినీతి పాలనపై తాము పోరాడుతున్నామని వెల్లడించారు.