న్యూఢిల్లీ: హరిద్వార్లో మహిళల గురించి అభ్యంతరకర, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన యతి నర్సింగానందను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నెల రోజుల క్రితం యతి నర్సింగానంద హరిద్వార్లో ధర్మ సన్సద్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళల గురించి అభ్యంతరకరమైన, విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఇటీవల కేసు నమోదుచేసిన పోలీసులు గత శనివారం యతి నర్సింగానందను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హరిద్వార్లో జరిగిన ధర్మ సన్సద్లో విద్వేషపూర్తిగా వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన రెండో వ్యక్తి యతి నర్సింగానంద.
అంతకుముందు నారాయణ్సింగ్ త్యాగి కూడా విద్వేష ప్రసంగం చేసిన కేసులో అరెస్టయ్యాడు. వసీమ్ రిజ్వీ అనే వ్యక్తే కొంతకాలం క్రితం నారాయణ్సింగ్ త్యాగిగా సన్యాసం తీసుకున్నారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని స్వామీజీ సమర్థించుకుంటున్నారు. పోలీసులంటే తనకు భయంలేదని, ఇప్పటికీ తాను తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.