న్యూఢిల్లీ : విజయదశమిని (Vijayadashami) దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్న క్రమంలో మంగళవారం ఢిల్లీలో హమాస్ దిష్టిబొమ్మను పలువురు దగ్ధం చేశారు. ప్రీత్ విహార్ ప్రాంతంలో స్ధానికులు హమాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉగ్రవాదాన్ని అంతమొందించాలని నినాదాలతో హోరెత్తించారు. విజయదశమి సందర్భంగా ఏటా రావణ, కుంభకర్ణ, మేఘ్నాద్ వంటి రాక్షసుల దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.
హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్- ఉగ్రసంస్ధ హమాస్ ఫైటర్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడిని ఖండిస్తూ ప్రీత్ విహార్ ప్రాంత ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని నినదించారు. హమాస్ అమాయక పిల్లలు, ఇజ్రాయెల్ ప్రజలకు హాని కలిగిస్తోందని, వారిపై వేధింపులకు తెగబడుతోంది ఉగ్రసంస్ధ తీరు రాక్షసంగా ఉందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ దేశమైనా అమాయకులు, పిల్లను వేధింపులకు గురిచేస్తుందో వారిని తాము వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. హమాస్ యుద్ధ నేరాలను వ్యతిరేకిస్తూ తాము రావణుడి దిష్టిబొమ్మ స్ధానంలో హమాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశామని స్ధానికులు తెలిపారు.
Read More :
Jammu Kashmir | ఒకే కాన్సులో నలుగురికి జన్మ.. గంటల వ్యవధిలోనే శిశువులందరూ మృతి