న్యూఢిల్లీ, మే 1: రెండో విడత కింద బంగారు నగలకు జూన్ 1 నుంచి హాల్మార్క్ తప్పనిసరి కానున్నదని కేంద్రం వెల్లడించింది. బంగారు ఆభరణాల నాణ్యత తెలిపేదే హాల్మార్క్. 2021 జూన్ 16 వరకు ఈ హాల్మార్క్ అనేది స్వచ్ఛందంగా ఉండేది. తొలివిడత కింద కేంద్రం 256 జిల్లాల్లో హాల్ మార్క్ తప్పనిసరి చేసింది. రెండో విడత కింద 32 జిల్లాల్లో అమలు చేయనున్నది.