నాగ్పూర్లో రోడ్ షో అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండేను సీఎంగా చేయాలని నేనే ప్రతిపాదించా. పార్టీ సీనియర్లు నా ప్రతిపాదనను అంగీకరించారు. బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కావాలంటే సీఎం పదవి దక్కించుకోవచ్చు. కానీ, మా పార్టీ ఏక్నాథ్ షిండేను సీఎం చేసింది’ అని చెప్పారు.
ఆ వెంటనే.. ‘షిండేను సీఎంగా చేయాలని మా నాయకులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నిర్ణయం తీసుకొన్నారు. మా పార్టీ తీసుకొన్న నిర్ణయంతో నేను సంతోషంగానే ఉన్నా’ అని అన్నారు. అంటే.. అసలు ఫడ్నవీస్ ఆ ప్రతిపాదనే చేయలేదన్నది స్పష్టమవుతున్నదని, ఆయన అసంతృప్తితో ఉన్నారన్నది నిజమేనని నెట్టింట్లో జోరుగా చర్చించుకొంటున్నారు.