కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్నా నుంచి గౌహతి వెళుతున్న గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ బెంగాల్లోని మైనాగురి సమీపంలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా ఆరు బోగీలు తలకిందులయ్యాయి. రైలులో ఎంతమంది ప్రయాణీకులున్నారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. రైలు ప్రమాదంలో 12 కోచ్లు దెబ్బతిన్నాయని ప్రమాద స్ధలానికి డీఆర్ఎం, ఏడీఆర్ఎం చేరుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో పలువురు బోగీల నుంచి కిందకు దూకడం కనిపించింది.
సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రైలు భారీ కుదుపుకు లోనవడంతో తాము రైలు పట్టాలు తప్పిందని గుర్తించామని బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ ప్రయాణీకుడు తెలిపారు.గౌహతి-బికనీర్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనపై రైల్వే భద్రతా విచారణకు ఆదేశించామని రైల్వేలు తెలిపాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేసి రైలు ప్రమాద ఘటనపై ఆరా తీశారు.