న్యూఢిల్లీ: కదులుతున్న కారుపై ఒక వ్యక్తి ప్రమాదకరంగా పుష్ అప్లు చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. దీంతో పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయడంతోపాటు కారు యజమానికి జరిమానా విధించారు. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని హర్యానాకు చెందిన గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. రాత్రి వేళ కొందరు వ్యక్తులు కారులో ప్రమాదకరంగా ప్రయాణించారు. వారంతా మద్యం తాగుతూ కనిపించారు. ఒక వ్యక్తి కారు టాప్పై ఉన్నాడు. కదులుతున్న కారుపై అతడు పుష్ అప్లు తీశాడు. మిగతా ముగ్గురు కూడా కారు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడారు.
కాగా, ఆ కారు వెనుక ఉన్న మరో కారు ముందు భాగంలోని కెమేరాలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో వారు స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు. ఆ కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారు యజమానికి రూ.6,500 జరిమానా విధించారు. ఆ వ్యక్తులపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు.
They have no fear of anyone's life and neither of Gurgaon trafficpolice @TrafficGGM
Vichle no HR72F6692@DC_Gurugram @TrafficGGM@cmohry @gurgaonpolice pic.twitter.com/pM2NeypUdR— Pradeepdubey (@dubey_100) May 30, 2023