గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఓ మహిళను అడ్డంపెట్టుకొని, తనపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇదో పిరికిపంద చర్య అంటూ ఫైర్ అయ్యారు. ఓ మహిళా పోలీసును వేధించిన కేసులో అసోం కోర్టు ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ.. తానెవ్వరికీ తల వంచేది లేదని స్పష్టం చేశారు.
తన అరెస్ట్ ఉదంతాన్ని ఏమాత్రం సింపుల్గా తీసుకోడానికి వీల్లేదని, పీఎంవో ఆదేశాల ప్రకారమే తనపై కేసులు మోపారని మేవానీ ఆరోపించారు. ”నేను చేసిన ట్వీట్పై ఇప్పటికీ గర్వపడుతున్నా. ఓ పౌరుడిగా దేశంలో శాంతి, సామరస్యం ఉండేలా చూడాలని కోరా. ఇలా అడగడం నా హక్కు కూడా. ఓ బాధ్యతాయుత శాసనసభ్యుడిగా శాంతియుతంగా ఉండాలంటూ ప్రజలకు చెప్పడం నా కర్తవ్యం” అంటూ మేవానీ చెప్పుకొచ్చారు.