Toll Plaza | మోర్బి, డిసెంబర్ 7: జాతీయ రహదారిపై నకిలీ టోల్ ప్లాజా నడుపుతున్న వ్యక్తులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్బి జిల్లాలో సుమారు ఏడాది నుంచి నిర్వహిస్తున్న ఈ నకిలీ టోల్ ప్లాజా ద్వారా నిందితులు 75 కోట్లకు పైగా వసూలు చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు స్థానికంగా పలుకుబడి ఉన్న ఒక నేత కుమారుడు సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. బంబన్బోర్-కుచ్ నేషనల్ హైవేపై మోర్బి-వాంకనర్ ఊర్ల మధ్య వఘాసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఆ టోల్ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేసి మధ్యలో నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.