అహ్మదాబాద్: బీజేపీ ర్యాలీలో అపశృతి జరిగింది. ఆవు దాడిలో మాజీ డిప్యూటీ సీఎంతోపాటు పలువురు గాయపడ్డారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో కాడి ప్రాంతంలో బీజేపీ నేతలు ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్తోపాటు పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు. అయితే రోడ్డుపై వెళ్తున్న ఒక ఆవు బెదిరిపోయింది. బీజేపీ ర్యాలీపైకి అది దూసుకెళ్లింది. నేతలు, కార్యకర్తల మీదుగా పరుగెత్తింది. దీంతో నితిన్ పటేల్తోపాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు.
కాగా, ఆవు దాడిలో నితిన్ పటేల్ కాలికి గాయమైంది. ఆయనకు వెంటనే అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అహ్మదాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు 20 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు నితిన్ పటేల్ తెలిపారు.
మరోవైపు బీజేపీ ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీలోకి ఆవు దూసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ నేతల మీదుగా ఆ ఆవు పరుగుదీయడం చూసి కొందరు షాకయ్యారు.
#Gujarat: Deputy CM #NitinPatel injured by #cattle during #Tiranga rally#HarGharTiranga #HarGharTirangaCampaign #IndependenceDay #IndependenceDay2022 #AzadiKaAmritMahotsav #JaiHind #BharatMataKiJai #AzadiKaAmritMahotsav2022 #Patriotism pic.twitter.com/sdUABpsebw
— Free Press Journal (@fpjindia) August 13, 2022