అహ్మదాబాద్ : దాదాపు ఆరున్నర నెలల పాటు కరోనాపై పోరాడి మహిళ ఎట్టకేలకు ఆసుప్రతి నుంచి డిశ్చార్జి అయ్యింది. గుజరాత్లోని దాహోద్కు చెందిన గీతా ధార్మిక్ (45) కరోనా సోకడంతో ఈ ఏడాది మే 1న ఆసుప్రతిలో చేరింది. అప్పటి నుంచి ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వస్తున్నది. 202 రోజుల తర్వాత ఆమె శనివారం డిశ్చార్జి అయ్యింది. ఆమె భర్త దాహోద్లోని రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో భోపాల్ నుంచి తిరిగి వచ్చిన సమయంలో గీతకు కరోనా వైరస్ సోకినట్లు మహిళ భర్త తెలిపారు. కరోనా బారినపడ్డ మహిళ 202 రోజుల పాటు దాహోద్తో పాటు వడోదరలోని ఆసుపత్రిలో చికిత్స పొందారని, వెంటిలేటర్, ఆక్సిజన్పై ఉంచి చికిత్స అందించారన్నారు. అయితే, చికిత్స సమయంలో తొమ్మిది సార్లు గీత ఆరోగ్య పరిస్థితి విషమించిందని ఆయన చెప్పారు.
గీత తల్లి మరణించగా.. ఏప్రిల్ 23న భోపాల్కు వెళ్లారు. 25న దాహోద్కు తిరిగి వచ్చాక తన భార్యకు కరోనా లక్షణాలు కనిపించగా.. మే 1న పాజిటివ్గా తేలిందని ఆమె భర్త తెలిపారు. అదే రోజు రాత్రి దాహోద్లోని రైల్వే ఆసుపత్రిలో చేర్పించామని పేర్కొన్నారు. ఎట్టకేలకు తన భార్య కోలుకొని ఇంటికి రావడంతో కుటుంబంలో సంతోషం నెలకొందని చెప్పారు.