గాంధీనగర్: గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్పై పోలీసులు కేసు నమోదుచేశారు. 2020 జూలై 30న గాంధీనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్కు తనను పిలిపించుకున్నారని, పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్కాల్స్కు ఆయన స్పందించలేదని, తమ మధ్య సంబంధం ఉన్న విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో 2021లో హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్మార్పై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో గాంధీనగర్ సెక్టార్-21 పోలీస్స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. ఇప్పటికే అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. అదేవిధంగా రాజస్థాన్లో మైనర్ బాలికను అపహరించిన కేసులో రాజేంద్రసిన్హ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను గుజరాత్ హైకోర్టు 2023, ఏప్రిల్లో తిరస్కరించింది.