అహ్మాదాబాద్: గుజరాత్లో బీజేపీ పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింహ వాఘేలా(Pradeipsinh Vaghela) రాజీనామా చేశారు. ఆ పోస్టుకు రాజీనామా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో అన్నీ సర్ధుకుంటాయన్నారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజీనామా చేసినట్లు ఆ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రజినీభాయ్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ఇటీవల వాఘేలా పేర్కొన్నారు.
వాఘేలా స్వచ్ఛంధంగా రాజీనామా చేశారని, దాన్ని ఆమోదించినట్లు కూడా పటేల్ తెలిపారు. తొలుత వాఘేలాపై రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆంక్షలు విధించారు. ఆయన్ను బ్యాన్ చేశారు. ప్రస్తుతం వాఘేలా ట్విట్టర్ ప్రొఫైల్లో .. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని మాత్రమే ఉంది. భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన వాఘేలా.. 2016 నుంచి ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.