గుజరాత్: గుజరాత్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయగా, తాజాగా అసెంబ్లీ స్పీకర్ పదవి నుంచి తప్పుకున్నాడు. గుజరాత్ శాసన సభకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచనతో సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. దీంతో అతని స్థానంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ను సీఎంగా నియమించింది. ఆయన సోమవారం ప్రమాణ స్వీకారం కూడా చేశారు.
అయితే తాజాగా అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని అసెంబ్లీ సెక్రెటరీ ప్రకట జారీ చేశారు. అయితే రాష్ట్రంలో నూతన మంత్రివర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయడం విశేషం.