కోల్కతా, మార్చి 13: తీర జలాల్లో నిఘాకు, యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో రెండు యుద్ధ నౌకలు చేరాయి. ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ పేరుతో ఉన్న ఈ రెండు నౌకలను ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సతీమణి నీతా చౌదరి బుధవారం ప్రారంభించారు. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే కొత్త తరం యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, ఎయిర్క్రాఫ్ట్ కేరియర్లు తయారు చేస్తున్నాయని, అందులో భారత్ చేరినందుకు గర్వంగా ఉందని వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ప్రస్తుతం తయారైన రెండు యుద్ధ నౌకలు 80 శాతం దేశీయ పరిజ్ఞానం, పరికరాలతో తయారయ్యాయని చెప్పారు.