న్యూఢిల్లీ : పెంపుడు కుక్కతో మనషులకు ఉండే అనుబంధం విడదీయలేనిది. తాజాగా పెండ్లి కుమారుడు పెంపుడు కుక్కతో పాటు పెండ్లి మండపానికి బైక్పై చేరుకున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దర్శన్ నందు పాల్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేయగా ఇప్పుడిది పది లక్షలకుపైగా వ్యూస్ను రాబట్టింది.
ఈ వైరల్ వీడియోలో దర్శన్ షేర్వాణి ధరించి బైక్పై కూర్చోగా షేర్వాణి ధరించిన పెంపుడు కుక్క సైతం బైక్పై దర్జాగా కూర్చుని పెండ్లి మండపానికి చేరుకోవడం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెంపుడు కుక్క వైన్ కలర్ షేర్వాణిలో మెరిసిపోతోంది. ఈ వీడియోకు లైక్ ఏ బాస్ అని క్యాప్షన్ ఇవ్వగా నేను ఈరోజు అత్యంత అద్భుతమైన రోజును ఆస్వాదించా అని ఓ యూజర్ రాసుకొచ్చారు.