శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద అకస్మాత్తుగా గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మృతి చెందారని ఆర్మీ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి పూంచ్లోని మెంధార్ సెక్టార్లో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. గ్రెనేడ్ పేలిన సమయంలో ఇతర సైనికులతో కలిసి ఆర్మీ కెప్టెన్తో పాటు నాయబ్ సుబేదార్ (JCO) విధులు నిర్వహిస్తున్నారని ఢిపెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హెలికాప్టర్లో ఉధంపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. మృతులను కెప్టెన్ ఆనంద్, నాయబ్ సుబేదార్ భగవాన్ సింగ్గా గుర్తించారు. విధులు నిర్వహిస్తూ అత్యున్నత త్యాగం చేసిన అధికారులను జనరల్ ఆఫీసర్ కమాండింగ్, వైట్ నైట్ కార్ప్స్కు చెందిన అన్ని ర్యాంకులు ఘన నివాళులర్పించాయి. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపాయి.