బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో ప్రాథమిక విచారణ రిపోర్టు వెల్లడైంది. తొలుత కోరమండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express)కు మెయిన్ లైన్లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ సిగ్నల్ను మార్చేసినట్లు తెలింది. అయితే కోరమండల్ ట్రైన్ లూప్ లైన్లోకి ఎంటర్ అయి.. ఆ ట్రాక్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. గూడ్స్ను ఢీకొట్టిన తర్వాత కోరమండల్ రైలు డిరేల్ అయినట్లు సూపర్వైజర్ల విచారణలో వెల్లడైంది. అయితే అదే సమయంలో డౌన్ లైన్లో వస్తున్న యశ్వంత్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన కోరమండల్ ట్రైన్ను ఢీకొట్టింది. దీంతో యశ్వంతపూర్ నుంచి వస్తున్న ఆ రైలుకు చెందిన రెండు బోగీలు కూడా పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. వెయ్యి మందికి వరకు గాయపడ్డారు.
గూడ్సు రైలు బోగీలపైకి కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ ఎక్కి ఉన్న కారణంగా.. ఆ ట్రైన్ గూడ్స్ను ఢీకొట్టి ఉంటుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం కోరమండల్ కోచ్లు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టాలు తప్పిన కోరమండల్ కోచ్లు కొన్ని గూడ్స్ రైలును ఢీకొట్టాయని, కొన్ని బోగీలు డౌన్ మెయిన్ లైన్పై పడినట్లు భావిస్తున్నారు.