హైదరాబాద్ : పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ఇస్రో లాంచ్ ఆథరైజేషన్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ను నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఏపీ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ను నింగిలోకి పంపనున్నారు.
ప్రయోగ సన్నాహకాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం షార్లో జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశంలో ఇస్రో నూతన చీఫ్ ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు. సాయంత్రం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించేందుకు చేస్తున్నారు. నిర్విరామంగా 25.30 గంటలపాటు కౌంట్డౌన్ కొనసాగించి.. సోమవారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ-సి52 రాకెట్ను నింగిలోకి పంపనున్నారు.