న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవంగా ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఈ అవార్డులను అందజేశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎమ్ కృష్ణ, పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా, నేపథ్య గాయకుడు సుమన్ కళ్యాణ్పూర్, ఆధ్యాత్మిక వేత్త కమలేశ్ డి పటేల్ మొదలైనవారు ఈ పురస్కారాలు స్వీకరించినవారిలో ఉన్నారు. పురస్కారం స్వీకరించే సమయంలో కొందరు గ్రహీతలు భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ నుంచి డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ బండి రామకృష్ణారెడ్డి, కమలేశ్ డీ పటేల్.. పద్మపురస్కారాలు అందుకున్నారు. వృద్ధాప్యం కారణంగా నడవడానికి ఇబ్బంది పడిన సుమన్ కళ్యాణ్పూర్కు పద్మ భూషణ్ పురస్కారం అందించడానికి రాష్ట్రపతి ముర్ము ముందుకు కదలి వచ్చారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పురస్కారాల ప్రదానోత్సవానికి విచ్చేశారు. మొత్తం 54 మందికి బుధవారం పద్మ పురస్కారాలు అందించారు. మిగతావారికి మరొక కార్యక్రమంలో అందించనున్నారు.