న్యూఢిల్లీ : కరోనా వైరస్ మూడో ముప్పు తలెత్తుతుందనే ఆందోళనల నేపథ్యంలో థర్డ్ వేవ్ అంచనాలపై ప్రభుత్వం స్పందించింది. కొవిడ్ థర్డ్ వేవ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా దానిపై స్పష్టమైన అంచనాలు లేవని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా మూడో ముప్పుపై స్పష్టమైన సంకేతాలు కానీ అంచనాలు కానీ వెల్లడి కాలేదని..ప్రజలు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూ ఉంటే మరొక వేవ్ ఉండే అవకాశం లేదని పేర్కొన్నాయి.
ఇక బూస్టర్ డోసులకు అనుకూలంగా భారత్లో నిపుణుల సూచనలు ఏవీ ప్రభుత్వానికి అందుబాటులో లేవని తెలిపాయి. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.