లక్నో: కట్నం కింద ఖరీదైన కారు ఇవ్వనందుకు ప్రభుత్వ కాలేజీ లెక్చరర్ ఏకంగా పెళ్లిని రద్దు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఈ సంఘటన జరిగింది. విజయ్నగర్లోని సిద్ధార్థ్ విహార్లో నివసిస్తున్న ఒక వ్యక్తి ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. గత ఏడాది మేలో ఒక మహిళతో అతడికి పెళ్లి సంబంధం కుదిరింది. ఆ ఏడాది జూన్ 19న నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జనవరి 30న వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
కాగా, పెళ్లికి నెల రోజుల ముందే కట్నం కింద ఖరీదైన కారు కొనివ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబం అక్టోబర్ 10న వాగనార్ను బుక్ చేసింది. అయితే తమకు ఫార్చ్యూనర్ కారు కావాలని వరుడి కుటుంబం డిమాండ్ చేసింది. అంత ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చేందుకు వధువు కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువు ఫోన్కు వరుడు మెసేజ్ పంపాడు. దీంతో వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుడు, అతడి కుటుంబంపై వరకట్నం చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.