న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ఎలక్టోరల్ బాండ్ల 24వ విడత జారీకి కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు బాండ్లు అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి. బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న సోమవారమే గుజరాత్ అసెంబ్లీ రెండో దశ పోలింగ్ జరుగనున్నది.
ఎస్బీఐ దేశవ్యాప్తంగా 29 బ్రాంచ్ల ద్వారా ఈ బాండ్ల అమ్మకం చేపడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.