న్యూఢిల్లీ, జూలై 6: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న సందర్భంగా జూలై 19న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నదని అధికారిక వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి. ఈనెల 20న మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని తెలుస్తున్నది. మణిపూర్లో జాతుల ఘర్షణ, హింస, ఒడిశా రైలు ప్రమాదం..సహా పలు అంశాల్ని లేవనెత్తడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలపైనా దీని ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో విపక్ష కూటమి పార్లమెంట్లో మోదీ సర్కార్ను ఏ విధంగా టార్గెట్ చేయనున్నది ఆసక్తికరంగా మారింది.