న్యూఢిల్లీ: మణిపూర్లో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న 9 మైతీ తీవ్రవాద సంస్థలు, వాటి అనుబంధ సంస్థలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం పొడిగించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు, భద్రతా దళాలపై దాడులకు పాల్పడుతున్నందుకు ఈ సంస్థలను మరో ఐదేండ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది.
మైతీ తీవ్రవాద సంస్థలను కట్టడి చేయకపోతే, వేర్పాటువాద, ఉగ్రవాద, హింసాత్మక కార్యకలాపాలను పెంచుతాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.