బెంగళూరు: బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కళబుర్గి, బ్యాదరహళ్లి వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రశ్నించగా బొమ్మై స్పందించారు.
‘‘ఇలాంటి ఘటనలు కొన్ని జరుగుతున్న నేపథ్యంలోనే ప్రలోభాలకు గురిచేయడం, బలవంతం చేయడం ద్వారా మతమార్పిడులు చేయకుండా చట్టం తెచ్చేందుకు ఆలోచిస్తున్నాం.’’ అని ఆయన అన్నారు. ఈ విషయంలో వారం రోజుల క్రితం కర్ణాటక హోంమంత్రి కూడా మాట్లాడారు. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావచ్చే విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని ఆరగ జ్ఞానేంద్ర అన్నారు.
కాగా, ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలవంతపు మతమార్పిడులను నిరోధించే చట్టాలు చేశారు.