న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతోపాటు ప్రియురాలని వేధిస్తున్నందుకు సీనియర్ అధికారిని ఒక క్లర్క్ హత్య చేశాడు. (Clerk Kills Senior Officer ) ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్కే పురంలో ఈ సంఘటన జరిగింది. 42 ఏళ్ల మహేష్ కుమార్ సర్వే ఆఫ్ ఇండియా డిఫెన్స్ ఆఫీసర్ కాంప్లెక్స్లో సీనియర్ సర్వేయర్. అప్పుగా తీసుకున్న రూ.9 లక్షలు తిరిగి ఇవ్వడం లేదని, తన ప్రియురాలిని కూడా అతడు వేధిస్తున్నాడని క్లర్క్ అనీష్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో మహేష్ను హత్య చేయాలని ప్లాన్ చేశాడు.
కాగా, ఆగస్ట్ 28న అనీష్ సెలవు తీసుకున్నాడు. లజ్పత్ నగర్లోని మార్కెట్లో పాలిథిన్ షీట్, పార కొనుగోలు చేశాడు. ఆర్కే పురం సెక్టార్ 2లోని తన నివాసంలో కలుద్దామంటూ మహేష్ కుమార్ను పిలిచాడు. అక్కడకు వచ్చిన ఆ సీనియర్ అధికారి తలపై పైప్ రెంచ్తో కొట్టి హత్య చేశాడు. అనంతరం సొంతూరైన హర్యానాలోని సోనిపట్కు బైక్పై పారిపోయాడు. మరునాడు ఢిల్లీకి తిరిగి వచ్చాడు. రాత్రి వేళ క్వాటర్స్లోని ఆవరణలో గొయ్యి తవ్వి మహేష్ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అక్కడ సిమెంట్తో కప్పేశాడు.
మరోవైపు మహేష్ కుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. సెప్టెంబర్ 2న మహేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లర్క్ అనీష్ను అరెస్ట్ చేయగా చేసిన నేరాన్ని అతడు ఒప్పుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.