Train Derails | పశ్చిమ రైల్వేలోని రత్లాం రైల్వే డివిజన్లో మరో భారీ ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబై మార్గంలో దాహోద్ సమీపంలో గూడ్స్ రైలు 16 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు మరో మార్గంలో రైళ్లను మళ్లిస్తున్నారు. ఢిల్లీ-ముంబై మార్గంలోని గుజరాత్ రాష్ట్రంలోని దహోద్ సమీపంలోని మంగళ్మౌడి, లిమ్ఖేడా స్టేషన్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న వెంటనే రత్లాం నుంచి సహాయక బృందం రాత్రికి సంఘటనా స్థలానికి చేరుకుంది. వీరితో పాటు రైల్వే ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో గూడ్స్ రైలు చక్రాలు కోచ్ నుంచి విడిపోయాయి.
దీంతో ఢిల్లీ-ముంబై ప్రధాన లైన్లో భారీగా రైళ్ల రాకపోకలు స్తంభించగా.. పలు రైళ్లను మళ్లించారు. అయితే రైలు పట్టాలు తప్పడం సోమవారం వేకువ జామున 5 గంటలకు ఓ బృందాన్ని ఉన్నతాధికారులు పంపారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజుల్లో రత్లాం డివిజన్లో ఇది రెండో అతిపెద్ద రైలు ప్రమాదం. ఇంతకు ముందు ఇండోర్ – ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రత్లాం రైల్వేస్టేషన్లో రెండుకోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే మరో ప్రమాదం చోటు చేసుకున్నది. రైలు పట్టాలు తప్పడంతో 23 రైళ్ల రూట్మార్చారు. ఆగస్ట్ క్రాంతి ఎక్స్ప్రెస్, సోమనాథ్-జబల్పూర్ ఎక్స్ప్రెస్, ముంబై సెంట్రల్-ఇండోర్ అవంతిక ఎక్స్ప్రెస్, పూణే-ఇండోర్ ఎక్స్ప్రెస్, దాహోద్-రత్లాం రైలు సహా పలు రైళ్లు ప్రభావితమయ్యాయి. మధ్యాహ్నం వరకు ఈ మార్గంలో రాకపోకలను తిరిగి పునరుద్ధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Gujarat | A goods train derailed near Mangal Mahudi railway station in Dahod district at around 1 am earlier today. Rail traffic movement disrupted. Further details are awaited. pic.twitter.com/ankjEtB3fl
— ANI (@ANI) July 18, 2022