Gold chain for dog : కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. ఆందోళనకు గురవుతారు. పిల్లలకు కొనిపెట్టినట్టే వాటికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడుతారు. ముంబైకి చెందిన ఒక మహిళ మాత్రం ఇంతకు మించే చేసింది.
ముంబైలోని చెంబూర్ ఏరియాలో సరితా సల్దాన్హా అనే మహిళ నివసిస్తున్నది. ఆమె ఓ దేశవాలీ కుక్కను పెంచుకుంటుంది. దానికి టైగర్ అనే పేరు పెట్టింది. పోయిన నెల టైగర్ పుట్టినరోజును సరిత ఘనంగా నిర్వహించింది. పుట్టిన రోజు సందర్భంగా టైగర్ ఖరీదైన గిఫ్ట్ బహూకరించింది. స్థానికంగా ఉన అనిల్ జ్యుయెలరీ దుకాణానికి టైగర్ను తీసుకెళ్లి ఓ బంగారు గొలుసు కొనుగోలు చేసింది.
మూడున్నర తులాల బరువున్న బంగారు గొలుసును సరితా సల్దాన్హా ఏకంగా రూ.2.5 లక్షలు వెచ్చించి కొన్నది. జ్యుయెలరీ షాపులోనే ఆ గొలుసును కుక్క మెడలో వేసింది. సరిత కుక్క మెడలో గొలసు వేస్తున్న దృశ్యాలను సరితా జ్యుయెలరీ సిబ్బంది వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.