న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వాట్సాప్, యాపిల్ మెసేజెస్ యాప్, సిగ్నల్ వంటి యాప్లలో ఉన్న ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సదుపాయాన్ని టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ సంస్థ మొదటిసారిగా జీమెయిల్ వెబ్ వెర్షన్లో ప్రవేశపెట్టింది. జీమెయిల్ వర్క్స్పేస్ ఫర్ కార్పొరేట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ క్లయింట్స్కు ఈ ఎన్క్రిప్షన్ సదుపాయం టెస్టింగ్ను ప్రారంభించింది. అయితే ఈ ఎన్క్రిప్షన్ పనిచేయాలంటే కంపెనీ అడ్మినిస్ట్రేటర్ క్లయింట్ సైడ్ ఎన్క్రిప్షన్(సీఎస్ఈ)ను ఆన్ చేయాల్సి ఉంటుందని గూగుల్ తెలిపింది.
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా సందేశాన్ని పంపిన వారు, రిసీవ్ చేసుకొన్న వారు తప్ప.. మూడో వ్యక్తి చూడలేరు. సైబర్ దాడుల నుంచి డాటాకు రక్షణ ఉండటంతో పాటు గూఢచార సంస్థలు ఆఖరుకు కమ్యూనికేషన్ సర్వీసు అందించే కంపెనీ కూడా సందేశాలను చూడలేవు.