ముంబై, జూన్ 18: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం చేయలేకపోతున్నానని, హెలికాప్టర్ కొనుక్కొని అద్దెకు తిప్పుకునేందుకు రూ.6.6 కోట్ల రుణం ఇవ్వాలని కోరుతూ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడో రైతు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
హింగోలి జిల్లాలోని తక్టోడా గ్రామానికి చెందిన కైలాశ్ పతంగేకు 2 ఎకరాల భూమి ఉంది. అయితే సకాలంలో వర్షాలు రాక, కరువు పరిస్థితులతో కొన్నేండ్లుగా వ్యవసాయం చేయలేకపోతున్నానని, భారంగా మారిందని కైలాశ్ చెబుతున్నారు. గత రెండేండ్లు తన పొలంలో సోయాబీన్ వేశానని, ఆదాయం రాలేదని పేర్కొన్నాడు. ‘కేవలం ధనవంతులకే పెద్ద కలలు ఉండాలని ఎవరు చెప్పారు? రైతులు కూడా పెద్ద కలలు కనాలి’ అని అంటున్నాడు కైలాశ్ పతంగే. అందుకే గోరేగావ్ పట్టణంలోని ఒక బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేశానని చెప్పుకొచ్చాడు.