న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్రేప్, ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులో దోషులైన 11 మందిని క్షమాభిక్ష కింద విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వీరి విడుదలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ బిల్కిస్ బానో కేసులో విచారణ, 11 మందికి క్షమాభిక్ష, ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను రెండు వారాల్లోగా సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ ఇంతకుముందు దాఖలైన పిటిషన్లలోనూ ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.