న్యూఢిల్లీ, మార్చి 21: సీనియర్ కేంద్ర మంత్రులు తనపై చేసిన నిరాధార, అసమంజస ఆరోపణలపై పార్లమెంటులో స్పందించడానికి తనకు హక్కు ఉందని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. 357 నిబంధన కింద ‘వ్యక్తిగత వివరణ’ ఇచ్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల లండన్ పర్యటనలో భారత్లో ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం రేగింది. ఈ విషయమై రాహుల్కు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతుండగా, ఆయన పార్లమెంట్కు క్షమాపణ చెప్పాలని బీజేపీ వాదిస్తున్నది.