మౌ, డిసెంబర్ 31: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బావిలోకి విసిరేశారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. మౌ జిల్లా ఘోసి పోలీస్స్టేషన్లోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలిక శుక్రవారం ఉదయం చెత్తను పారవేసేందుకు బయటకు వెళ్లింది.
ఆ సమయంలో బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు, లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం బాలికను వ్యవసాయ బావిలో విసిరేశారు. స్థానిక కూలీలు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బాధితురాలిని రక్షించారు.