జోధ్పూర్: సహాయం చేస్తామని నమ్మించి 17 ఏండ్ల దళిత బాలికపై (Dalit girl) ముగ్గురు కాలేజీ విద్యార్థులు (College students) సామూహిక లైంగికదాడికి (Gang rape) పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకానికి పాల్పడిన ఘటన రాజస్థాన్లోని (Rajasthan) జోధ్పూర్లో (Jodhpur) జరిగింది. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి శనివారం అజ్మీర్ (Ajmer) నుంచి బస్సులో జోధ్పూర్ బయల్దేరింది. వారిరువురు జోధ్పూర్ చేరుకునేసరికి రాత్రి 10.30 గంటలు అయింది. దీంతో రూమ్ కోసం ఓ గెస్ట్ హౌస్కు (Guest house) వెళ్లారు. అయితే గెస్ట్ హౌస్ కేర్టేకర్ (Caretaker) ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో వారిద్దరు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు.
ఆ రాత్రివేళ వారు పౌటా చౌరాహా (Paota Chauraha) వెళ్లారు. అక్కడ వారికి సమందర్ సింగ్ భాటీ, ధర్మపాల్ సింగ్, భట్టమ్ సింగ్ (అంతా 20 నుంచి 22 ఏండ్ల వయస్కులే) తారసపడ్డారు. సహాయం చేస్తామని నమ్మబలికారు. ఆహారం, కూల్ డ్రింక్స్ అందిస్తామని, దుహాన్లోని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఆ మాటలు నమ్మిన ఇద్దరు వారితో కలిసివెళ్లారు. అలా.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జై నారాయణ్ వ్యాస్ యూనివర్సిటీ (JNVU) ఓల్డ్ క్యాపస్లో ఉన్న హాకీ గ్రౌండ్కు తీసుకెళ్లారు. అనంతరం బాధితురాలి స్నేహితుడిని చితకబాదారు. అతడి ముందే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.
అయితే తెల్లారుతుండటంతో అక్కడికి వాకింగ్కు వచ్చేవారు పెరుగుతున్నారు. దీంతో నిందుతులంతా అక్కడి నుంచి పరారయ్యారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిద్దరిని చూసిన మార్నింగ్ వాకర్లు (Morning Walkers) పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయాలయ్యాయని దుహాన్ డీసీపీ (Duhan DCP) చెప్పారు. వారిపై కేసు నమోదుచేశామని, నిధితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు.