భోపాల్: తుపాకీతో ఫొటోకి పోజులిచ్చింది. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవి వైరల్గా మారడంతో విషయం పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆమెతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్టుచేసిన ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) ఉజ్జయినీలో జరిగింది.
పవాసాకు చెందిన ఓ విద్యార్థిని సోషల్ మీడియా మాయలో పడి.. తన స్నేహితుడి సహాయంతో తుపాకీతో ఫొటొలు దిగింది. వీడియోలు తీయించుకుంది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అవి వైరల్గా మారాయి. దీంతో పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అక్రమాయుధాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు. వారిద్దరిని సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
తుపాకులు ఆట వస్తువులు కాదని, వాటిని సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేయడానికి ఉపయోగించకూడదని ప్రచారం నిర్వహిస్తున్నామని ఐజీ గజేంద్ర పచురియా చెప్పారు. కాగా, సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించడానికే తుపాకీతో పోజుల్చిమాని విద్యార్థులు తెలిపారు.