మొహాలీ: పంజాబ్లోని మొహాలీలో ఉన్న చండీగఢ్ యూనివర్సిటీ ఆందోళనలతో అట్టుడికిపోయింది. తమ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వర్సిటీలోని మహిళా విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి ఆందోళనకుదిగారు. తమతోపాటే హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. తాము బాత్రూముల్లో స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసిందని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా, వీడియోల వల్ల కొందరు ఆత్మహత్యకు యత్నించారని విద్యార్థులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు, వర్సిటీ అధికారులు ఖండించారు. వీడియో వ్యవహారం బయటపడగానే ఓ యువతి అస్వస్థతకు గురైందని పోలీసులు తెలిపారు. ఆమెను దవాఖానకు తరలించామని, ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉందన్నారు.
ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుచేశామని డిఎస్పీ రూపిందర్ కౌర్ తెలిపారు. ఓ నిందితురాలిని అరెస్టు చేశామన్నారు. దోషులకు తప్పనిసరిగా శిక్షపడేలా చేస్తామని, విద్యార్థులు ఆందోళనలు విరమించాలని కోరారు.
కాగా, విద్యార్థుల ఆందోళనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. వర్సిటీ విద్యార్థులు శాంతి యుతంగా ఉండాలని కోరారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన విషయమని, మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల గౌరవానికి సంబంధించిందన్నారు. మీడియాతోపాటు మనమంత ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
I humbly request all the students of Chandigarh University to remain calm, no one guilty will be spared.
It’s a very sensitive matter & relates to dignity of our sisters & daughters.
We all including media should be very very cautious,it is also test of ours now as a society.
— Harjot Singh Bains (@harjotbains) September 18, 2022
హాస్టల్లో ఉంటున్న మహిళా విద్యార్థి తన సహచరులు స్నానాలు చేస్తుండగా తీసిన వీడియోలను హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు చెందిన ఓ వ్యక్తికి పంపించిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతడు వాటిని ఎంఎంస్ క్లిప్స్గా మార్చి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాని తెలిపారు. వాటిని చూసి తామంతా షాక్ గురయ్యామన్నారు.