న్యూఢిల్లీ: అంతా చూస్తుండగా బాలికను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలోని పశ్చిమ విహార్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 9న నివాస సముదాయంలో ఉండే వ్యక్తి ఒక బాలికపై దాడి చేశాడు. తొలుత కర్రతో, అనంతరం చెప్పుతో ఆమెను కొట్టాడు. ఇది చూసి స్థానికులు చలించిపోయారు. ఢిల్లీ మహిళా కమిషన్కు సమాచారం ఇచ్చారు.
దీంతో మహిళా కమిషన్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. స్థానికులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆ వ్యక్తి డ్రగ్స్కు బానిస అని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోపించింది. ఆ బాలికను నిర్బంధించి హింసిస్తుంటాడని మహిళా కమిషన్ సిబ్బందికి తెలిపింది. అలాగే సీసీటీవీలో రికార్డైన దాడి వీడియో ఫుటేజ్ను అందజేసింది. బాలికను కాపాడాలని కోరింది.
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మలివాల్ సీరియస్గా స్పందించారు. బాలికపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీస్ పంపారు. ఆ బాలికను రక్షించి ఆమె సంరక్షణ బాధ్యతలు చూడాలని సూచించారు. నిందితుడి అరెస్ట్, తీసుకున్న చర్యలపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు సీసీటీవీలో రికార్డైన బాలికపై దాడి వీడియోను స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. ఆ బాలికకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
पश्चिम विहार की RWA से काफ़ी लोग मुझसे मिलने आए। उन्होंने मुझे ये विडीओ दिखायी कि कैसे लड़की को बेरहमी से एक आदमी मार रहा है। उनका कहना है ऐसा हर दूसरे दिन होता है। मैंने दिल्ली पुलिस को नोटिस इशू किया है। FIR दर्ज कर सख़्त से सख़्त कार्यवाही और लड़की की सुरक्षा होनी ही चाहिए! pic.twitter.com/rwYRi22iXj
— Swati Maliwal (@SwatiJaiHind) February 11, 2022