న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ అజాద్ (Ghulam Nabi Azad) స్పందించారు. కాంగ్రెస్ తన అజెండాలో మైనారిటీల అంశాలకు చోటు కల్పించనందునే ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైందని అన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై అజాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రముఖంగా ప్రస్తావించలేదని మండిపడ్డారు. మైనారిటీల ఛాంపియన్గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ గత 25 రోజులుగా ఎక్కడా మైనారిటీల గురించి మాట్లాడలేదని, ఇప్పుడు కాంగ్రెస్ అజెండాలో మైనారిటీలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మాజీ నేత అజాద్ ఇటీవల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని ఏర్పాటు చేశారు. ఇక మధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఛత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను మట్టికరిపించిన బీజేపీ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను దాటి దూసుకుపోతోంది.
Read More :