Assembly Election Results 2023: సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకు ఉత్తరాదిలో కాంగ్రెస్కు ఈ గతి పట్టిందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రమోద్ కృష్ణమ్.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ఓటమి దిశగా సాగుతుండటంతో ఈ కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినందుకే కాంగ్రెస్ నావ మునిగిపోతోందని అన్నారు. ఫలితాలు వెలువడుతున్నప్పుడే ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. సనాతన్ కా శాప్ అని ట్వీట్ చేశారు.
అనంతరం ఆయన ఇదే విషయమై స్పందిస్తూ.. కాంగ్రెస్ అంటేనే గాంధీ రఘుపతి రాఘవ రాజారాం అన్న సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్న పార్టీ అని ప్రజలు భావిస్తారు. కానీ ఇప్పుడది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పయనిస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ గనక ఈ వామపక్ష నాయకులను పార్టీ నుంచి బహిష్కరించకుంటే అది కూడా ఎఐఎమ్ఐఎమ్ లా మారుతుంది. ఈ దేశం కుల రాజకీయాలను ఎప్పటికీ ప్రోత్సహించదు. మూడు రాష్ట్రాల ఎన్నికలలో ఓటమికి కారణం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే.. అని తెలిపారు. కొద్దిరోజుల క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్టాలిన్.. ఇండియా కూటమిలో ఉండటంతో బీజేపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు.
सनातन का “श्राप”
ले डूबा.— Acharya Pramod (@AcharyaPramodk) December 3, 2023
#WATCH | On Congress trailing in MP, Rajasthan and Chhattisgarh, party leader Acharya Pramod Krishnam says, “Opposing Sanatan (Dharma) has sunk the party. This country has never accepted caste-based politics…This is the curse of opposing Sanatan (Dharma).” pic.twitter.com/rertLLlzMS
— ANI (@ANI) December 3, 2023