ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ పట్టణంలో యెల్లో, బ్లాక్, వైట్ ఫంగస్లతో బాధపడుతున్న కున్వర్సింగ్ మరణించారు. రాజ్నగర్ ఏరియాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కున్వర్ సింగ్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవలే కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న కున్వర్సింగ్ అస్వస్థతకు గురికావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. మే 24 ఆయనకు ఎండోస్కోపీ నిర్వహించగా అతనిలో యెల్లో, బ్లాక్, వైట్ ఇలా మూడు రకాల ఫంగస్లు ఉన్నట్లు తేలింది.
అప్పటినుంచి రాజ్నగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలోనే ఆయన చికిత్స పొందుతున్నారు. డాక్టర్ బీపీ త్యాగి పర్యవేక్షలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే టాక్సేమియా (రక్తం విషపూరితం కావడం) కారణంగా ఆయన ఇవాళ కన్నుమూసినట్లు డాక్టర్ బీపీ త్యాగి వెల్లడించారు. సంజయ్నగర్ ఏరియాకు చెందిన కున్వర్సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది అని, ఇటీవల కరోనా లక్షణాలతో ఆయన తన ఆస్పత్రిలో చేరారని బీపీ త్యాగి తెలిపారు.