గుర్తించిన జర్మనీ శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, మే 22: ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ను జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనలో ఇది కీలకం కానున్నదని తెలిపారు. సాధారణంగా ప్లాస్టిక్ పూర్తిగా మట్టిలో కలిసిపోవాలంటే వందల ఏండ్లు పడుతుంది. కానీ జర్మనీ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించిన పాలీస్టర్ హైడ్రోలేజ్(పీహెచ్ఎల్7) అనే ఎంజైమ్ కేవలం 16 గంటల్లోనే ప్లాస్టిక్ అణువులను తొంభై శాతం దాకా కుళ్లిపోయేలా చేస్తున్నది.
ప్లాస్టిక్ను తినే ఎంజైమ్ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. అయితే, గతంలో జపాన్లో గుర్తించిన ఎల్ఎల్సీ అనే ఎంజైమ్ కన్నా పీహెచ్ఎల్7 రెండు రెట్ల వేగంతో ప్లాస్టిక్ను తింటున్నదని లీప్జిగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.