హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ)(స్పెషల్ టాస్క్ బ్యూరో): భారత్లో గడిచిన పదేండ్లలో నియంతృత్వం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం క్షీణించిందని స్వీడన్లోని యూనివర్సిటీ ఆఫ్ గోతెన్బర్గ్కు చెందిన వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ (వీ-డెమ్) ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వెల్లడించింది.
భావప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, ఎన్నికలు జరుగుతున్న తీరు, పౌరహక్కుల నేతలపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వైఖరి ఆధారంగా ఈ నివేదిక తయారుచేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్తో సహా 42 దేశాల్లో ప్రజాస్వామ్యం తిరోగమన దిశలో ఉన్నదని, నియంతృత్వం పెరుగుతున్నదని తేల్చింది. నియంతృత్వ పోకడలకు కరోనా మరింత ఆజ్యం పోసిందని ఆందోళన వ్యక్తం చేసింది.