న్యూఢిలీ: త్రివిధ దళాల అధిపతుల స్టాఫ్ కమిటీ చైర్మన్గా(చైర్మన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ) ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే గురువారం బాధ్యతలు స్వీకరించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఈ పోస్టు ఖాళీ అయింది. దీంతో మూడు దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ, వాయు, నేవీ మూడు విభాగాల్లో సీనియర్గా ఉన్న ఎంఎం నరవణేను ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ దళాల ఛీఫ్లు సభ్యులుగా ఉంటారు. సీడీఎస్ పదవి సృష్టించకముందు త్రివిధ దళాల్లోకెల్లా సీనియర్ అయిన అధికారి ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించేవారు. సీడీఎస్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవులు వేర్వేరు.