చెన్నై : తమిళనాడు కూనూరు నీలగిరి కొండల్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన మధులికా రావత్ కూడా ప్రయాణించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బీ సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.
ఈ ప్రమాద ఘటనపై మరికాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది.