చెన్నై చిటోడే జిల్లాలోని ఓ ప్రైవేట్ కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఫ్యాక్టరీ యజమాని దామోదరన్ (43) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మంది ఆస్పత్రి పాలయ్యారు. సిలిండర్లో గ్యాస్ను రీఫిల్ చేస్తున్న సమయంలో ఈ లీకేజీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ గ్యాస్ను మొత్తం 20 మంది కార్మికులు పీల్చుకోగా, 13 మంది క్షణంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ 13 మంది కార్మికులు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు.