2014 తర్వాత తొలిసారి.. షెడ్యూల్ వెల్లడించిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు ఈ ఏడాది జూన్ 16 నుంచి చరిత్రాత్మక టెస్టు ఆడనుంది. 2014 తర్వాత టీమ్ఇండియా టెస్టు క్రికెట్ ఆడడం ఇదే తొలిసారి కానుంది. బ్రిస్టల్ వేదికగా జూన్ 16 నుంచి 19 వరకు ఓ టెస్టుతో పాటు ఆతిథ్య ఇంగ్లండ్తో భారత్ మూడు వన్డేలు (జూన్ 27, 30,జూలై 3), మూడు టీ20లు (జూలై 9, 11, 15) ఆడనుంది. ఈ సిరీస్ల షెడ్యూల్ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మంగళవారం ప్రకటించింది.