జైపూర్: గ్యాంగ్స్టర్ రాజు తేత్పై కాల్పులు జరిపిన దుండగులు అతడ్ని హత్య చేశారు. ఆ గ్యాంగ్స్టర్ను తామే చంపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. రాజస్థాన్లోని సికర్లో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఉద్యోగ్ నగర్ ప్రాంతంలోని గ్యాంగ్స్టర్ రాజు తేత్ ఇంటికి గుర్తు తెలియని నలుగురు దుండగులు వచ్చారు. తుపాకులతో అతడిపై కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం గన్స్తో గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, గ్యాంగ్స్టర్ రాజు తేత్ను తామే కాల్చి చంపినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. ఆ గ్యాంగ్కు చెందిన రోహిత్ గోద్రా ఫేస్బుక్ ద్వారా ఈ విషయం వెల్లడించాడు. సోదరులు ఆనంద్ పాల్ సింగ్, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకే రాజు తేత్ను హత్య చేసినట్లు అందులో పేర్కొన్నాడు.
మరోవైపు గ్యాంగ్స్టర్ రాజు తేత్ హత్య నేపథ్యంలో అతడి అనుచరులు సికర్లో బంద్కు పిలుపునిచ్చారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పోలీసులు రాజు తేత్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gang war in Sikar, Rajasthan.
Gangster Raju Theth shot dead.
Earlier Raju Theth had enmity with the Anandpal gang, according to sources currently Anandpal gang and Bishnoi gang were together.
Sikar police is investigating the matter. pic.twitter.com/ZLkkcNshRH— Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022