వారణాసి: గ్యాంగ్స్టర్, రాజకీయనేత ముఖ్తార్ అన్సారీకి ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1991లో జరిగిన కాంగ్రెస్ నేత అవదేశ్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు విధిస్తున్నట్టు వారణాసి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. అవదేశ్ రాయ్ను 1991లో ఆయన స్వగృహం వద్ద అన్సారీ, మరికొందరు కాల్పులు జరిపి హతమార్చారు. ఈ కేసులో 32 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు వచ్చింది. అన్సారీ గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరో హత్యకేసులో ఆయన పదేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.